యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను చేయబోయే సినిమాల దర్శకుల ఎంపికలో చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరైనా యంగ్ డైరెక్టర్ ఒక హిట్ ఇస్తే చాలు వెంటనే ఎన్టీర్ దృష్టి అతడి పై పడిపోతోంది. ‘సింహా’ తర్వాత బోయపాటికి, ‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్లకి, ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీష్ శంకర్ కు అవకాసాలిచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు ‘స్వామి రారా’ సినిమాతో సక్సెస్ కొట్టిన సుధీర్ వర్మకు అవకాశం ఇవ్వనున్నాడట.

 ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ వినేసిన తారక్ పక్కా స్క్రిప్ట్ ను, స్క్రీన్ ప్లేను సిద్దం చేసుకోమని చెప్పాడట. చిన్న దర్శకుడయిన సుధీర్ వర్మకు ఈ ప్రాజెక్టు ఓకే అయితే జాక్ పాట్ కొట్టినట్లే అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ సినిమాను తారక్ తో గతంలో ‘ఊసరవెల్లి’ సినిమా చేసిన బివిఎస్ఎన్ ప్రసాద్, ఆయన తనయుడు బాపినీడు నిర్మించడానికి సిద్దంగా ఉన్నారని సమాచారం .

 అంతేకాదు తన సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్ తో కనిపించడమే కాకుండా తన పాత్రల ఎంపికలో కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని ప్లాండ్ గ అడుగులు వేస్తున్నాడు జూనియర్. అంతేకాదు వరుస పెట్టి సినిమాలు చేస్తూ తోటి హీరోలకు సవాల్ ఇసురుతున్నాడు ఈ యంగ్ టైగర్...

 

మరింత సమాచారం తెలుసుకోండి: