ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి త‌న స‌త్తా ఏంటో చూపించాడు. గబ్బర్ సింగ్ తో దుమ్మురేపి బాక్సాఫీస్ ద‌గ్గర నెంబ‌ర్ వ‌న్ అనిపించుకున్న ప‌వ‌న్ ఇపుడు నా త‌రువాత ఎవ‌రైనా అనేలా అత్తారింటికీ దారేదీ శాటిలైట్ రైట్స్ తో ప్రూవ్ చేశాడు. జ‌ల్సా త‌రువాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో న‌టిస్తున్న అత్తారింటికీ దారేదీ శాటిలైట్ రైట్స్ రికార్డ్ స్ధాయిలో అమ్ముడుపోయింది.

ప‌వ‌ర్ స్టార్ కి జోడిగా సమంత‌, కృతిక‌ర్భంధ న‌టిస్తున్న అత్తారింటికీ దారేదీ ప్యూర్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం యూర‌ప్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఓ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ హెవీ కాంపిటీష‌న్ మ‌ద్య 9 కోట్లకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని చేజిక్కించుకుంది.

జ‌ల్సా కాంబినేష‌న్ అవ్వడం...గ‌బ్బర్ సింగ్ మానియా ఇంకా న‌డుస్తూ వుండ‌టం...ఈ సినిమాకు 9 కోట్లు శాటిలైట్ రైట్స్ ప‌లికేలా చేసింద‌ట‌. గ‌తంలో నాయ‌క్, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, బాద్ షా 8 కోట్ల కు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇపుడు ఆ సినిమాల‌న్నింటిని క్రాస్ చేస్తూ అత్తారింటికీ దారేదీ 9 కోట్లకు అమ్ముడు పోయి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌రేంటో ప్రూవ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: