నందమూరి నటసింహం బాలకృష్ణతో, డైరెక్టర్ బోయపాటి చేస్తున్న మూవీలో మిస్ ఇండియా ఏరికా ఫెర్నాండేజ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ అదంతా వట్టిదే అని పాపం ఈ మిస్ ఇండియా లబోదిబో అంటూ మీడియా ముందుకు వచ్చేసింది. 
 

నిజానికి త్రిష, ఇలియానా వంటి వారికే బాలయ్య సరసన ఛాన్స్ ఇస్తే బయపడి పారిపోయారు. అలాంటిది ఇప్పుడే పాల బుగ్గల పరువాల ప్రాయంలోకి వస్తున్న ఈ పోరి బాలయ్యతో చేస్తుందని అంటే ఆమె ఏమోగానీ విన్న జనం మాత్రం నవ్వుకున్నారు. ఒకానొక టైం లో నిజమేనేమో అనే అభిప్రాయం కూడా వచ్చేసింది. ఎందుకంటే సింహా మూవీలో స్నేహ ఉల్లాల్ తోనే బాలయ్య బాబు స్టెప్స్ వేశాడు. మరి ఈ భామతో వేయలేడా అని నందమూరి ఫాన్స్ కూడా ఈ విషయంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. 
 

కాని ఈ మూవీలో చేయడం లేదంటూ, ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ పుకారులేనంటూ ఎరికా తెలుపుతుంది. అసలు ఈ మూవీకి సంబంధించి తనకు ఎటువంటి ఆఫర్ రాలేదని, వస్తే నేనే ముందు చెప్పేదాన్నని తెలిపింది ఎరికా. సో మొత్తానికి ఈ 'డేగ' పిల్ల బాలయ్య అనగానే భయపడిపోయిందని అందరి నోటా వినబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: