తెలుగు సినిమా అంటే, త‌ప్ప‌కుండా ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే అని ద‌ర్శ‌కులు ఫిక్స‌యిపోతున్నారు. అందుకే... ఏదోలా త‌మ సినిమాలో ఐటెమ్ మ‌సాలా జొప్పిస్తున్నారు. ఇప్పుడు బ‌లుపు కోసం కూడా ఈ సెంట్రాఫ్ ఎట్రాక్ష‌న్ చేరిపోయింది.  ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం బ‌లుపు. శ్రుతిహాస‌న్‌, అంజ‌లి క‌థానాయిక‌లు.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లోని ఓ ప‌బ్‌లో ర‌వితేజ‌, ల‌క్ష్మీరాయ్‌ల‌పై ఓ గీతాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శేఖ‌ర్ మాస్టర్ నృత్యరీతులు స‌మ‌కూరుస్తున్నారు. ఈ పాట‌లో… చిత్రీక‌ర‌ణ పూర్తవుతుంది. ఈనెల 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అయినా ఈ సినిమా ఇంకా షూటింగ్ దశ‌లోనే ఉంది.

వీలైనంత వినోదం, కావ‌ల్సింత మాస్ మ‌సాలా ద‌ట్టించి వ‌ద‌లాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అందుకే ల‌క్ష్మీరాయ్‌ని కూడా హడావుడిగా దించేశారు. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: