ఆలుమ‌గ‌ల సిస‌లైన దాంప‌త్యానికి, సొగ‌సైన నిర్వ‌చ‌నం ఇచ్చారు త‌నికెళ్ల భ‌ర‌ణి. మిథునం సినిమాతో. శ్రీ‌ర‌మణ రాసిన క‌థ‌ను - అత్య‌ద్భుతంగా, అదే రెండే రెండు పాత్ర‌ల‌తో ఆవిష్క‌రించి - అద్బుత‌హా అనిపించారు భ‌ర‌ణి. ఈ సినిమాని విమర్శ‌కుల ప్ర‌సంశ‌లు ద‌క్కాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా తనికెళ్ల భ‌ర‌ణి మరో ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నాడు.

మ‌రో మిథునంలాంటి సినిమా కోసం ఆయ‌న క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. 
ఇప్ప‌టికే క‌థ  సిద్ధ‌మైంది. ఇది 1940 -50ల మ‌ధ్య న‌డిచే క‌థ అట‌. ఆ కాలంలో స‌మాజాన్ని తొలచి వేసిన ఓ అంశాన్ని నేప‌థ్యంగా తీసుకొని క‌థ అల్లుకొన్నార‌ట‌. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రానికి తిరుమ‌ల‌శెట్టి నీలిమ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పంజా సినిమా తీసిన నీలిమ ప్ర‌స్తుతం అలియాస్ జాన‌కి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ కొత్త సినిమా సంగ‌తులు తెలుస్తాయి.
కీ, సిరా, మిథునం లాంటి సినిమాల‌తో అవార్డులు, ప్ర‌సంశ‌లు అందుకొన్న భ‌ర‌ణి.. ఈ సినిమాతో డ‌బ్బులూ పోగేసుకోవాల‌ని కోరుకొందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: