సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లెవ‌రూ ముందుకు రాకపోతే - ఎవ‌రి సినిమాల్ని వాళ్లే తీసుకొంటుంటారు హీరోలు. త‌మిళంలో ఈ పోక‌డ ఎక్కువ‌గా ఉంటుంది. అక్క‌డ మ‌రో హీరో... సినిమా నిర్మాణంలో అడుగ‌పెట్టాడు. అత‌నెవ‌రో కాదు. విశాల్‌. పందెం కోడితో తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాడీ త‌మిళ హీరో.

ఆ సినిమా హిట్ట‌వ్వ‌డంతో వ‌రుస‌గా విశాల్ సినిమాలు తెలుగువారిపై దాడి చేశాయి.అయితే ఒక్క సినిమా కూడా విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. భారీ పెట్టుబ‌డితో తీసిన సెల్యూట్... బోల్తా ప‌డింది. దాంతో పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాడీ హీరో. నిర్మాత‌లెవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో సొంతంగా ఓ సినిమా తీస్తున్నాడు. అదే.. ధీరుడు. అర్జున్ కుమార్తె ఐశ్వ‌ర్య అర్జున్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. భూప‌తి పాండ్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకొంది. త‌మ‌న్‌ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఈనెల 25న ఈ చిత్రంలోని గీతాల‌ను విడుద‌ల చేస్తార‌ట‌. జులైలో ధీరుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.చేతిలో ఏమాత్రం విజ‌యాల్లేని ఈ హీరో... ఇప్పుడైనా ఓ హిట్టు కొడ‌తాడేమో చూడాలి. ధీరుడు అనిపించుకోవాలంటే.. చేతిలో హిట్టు ప‌డాల్సిందే మ‌రి. 

మరింత సమాచారం తెలుసుకోండి: