ఆంధ్రప్రదేశ్ లో స్థలాల కబ్జా ల గురించి విన్నాం చూసాము. కానీ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలను ఆరుగురు బడా నిర్మాతలు కబ్జా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ ఆరుగురి వల్లే టాలీవుడ్ స్టార్స్ పారితోషికాలు భారీగా పెరిగిపోతున్నాయని టాక్. ఈ ఆరుగురిలో మొదటిగా వచ్చే పేరు నిర్మాత బండ్ల గణేష్ ది అంటారు. కోటి రూపాయలు ఎక్కువైనా పరవాలేదు, టాప్ హీరోల కాల్ షీట్లు దొరికితే చాలు అంటూ ప్రవర్తించే ఈ నిర్మాత ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా పెట్టి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తీస్తున్నారు. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీలను తన అమాయకమైన మొహం తో ఒక చుట్టుచుట్టేసిన ఈ బండ్ల గణేష్, ఎంతటి వారినైనా గిఫ్ట్ తో కొట్టేస్తాడు. ప్రస్తుతం ఈ యన గారి కళ్ళు మహేష్ బాబు పై ఉన్నాయని టాక్.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో పంపిణీ దారుడిగా పరిచయమై నిర్మాతగా ఎదిగిన దిల్ రాజ్ గురించి చెప్పక్కరలేదు. స్వీట్ గా నవ్వుతూ ఎన్టీఅర్, మహేష్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా అందరి టాప్ హీరోలను చుట్టచుట్టేసిన ఘనత ఈయనిది ‘నమో వెంకటేశ’ అంటూ టాలీవుడ్ ఎంట్రీ యిచ్చి మహేష్ బాబుతో ‘దూకుడు’ పెంచి ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ తో రెండు సినిమాలు చేయడమే కాకుండా బాలయ్యను కూడా లైన్ లో పెట్టేసిన ఘనత 14 రీల్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంటలది. రెలియన్స్ సంస్థతో ‘సాహసం’ చేస్తూ మరో వైపు పవన్ తో ‘అత్తారింటికి దారేది’ అంటూ నడుస్తున్న బివిఎస్ఎన్ ప్రసాదు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రనిర్మతగా వెలుగొందు తున్నారు.

 నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి ఇక చెప్పనక్కరలేదు, జయాపజయాలతో సంబందం లేకుండా తన ‘తడాఖా’ చూపెడుతూ ప్రస్తుతం నాగార్జున, ఎన్టీర్ లతో రెండు సినిమాలు లైన్లో పెట్టేస్తున్నాడు. ఇక చివరిగా నిర్మాత నల్లమలపు బుజ్జీ, బన్నీ, సురేంద్ర రెడ్డిలతో కలిపి ‘రేసుగుర్రం’ ఎక్కుతున్నాడు. ఇలా ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ హీరోలంతా ఈ ఆరుగురు నిర్మాతలకు బందీలుగా మారిపోయారని చలోక్తులు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయలు పారితోషికలుగా వస్తూ ఉంటే ఏ హీరోలైనా నిర్మాతలకు ఇంతే ఇలా కబ్జా అయిపోతారు....   

మరింత సమాచారం తెలుసుకోండి: