సమంతాకి అయితే డైలాగ్ కూడా లేదు. రానా ఓ మాట మాట్లాడతాడు కానీ అది సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవ్వరికీ ఉపయోగం లేని అథితులు వీరు. సాధారణంగా అతిథి పాత్రలు అనగానే కథను మలుపు తిప్పేలా ఉంటాయేమో అని ఊహిస్తాం. ఉదాహరణకు " ఖుషి" సినిమానే తీసుకోండి. అందులో యస్.జె .సూర్య కథ ఆరంభంలో, చివరలో కనిపిస్తాడు.
తెరపై రెండు క్షణాలే కనిపించినా కథను మలుపుతిప్పే పాత్ర అది. ఆ తరహాలో తెరపై సందడి చేయాల్సిన పాత్రలు ఇప్పుడు ఉసూరుమనిపిస్తున్నాయి. సిద్ధార్థ్ తో ఉన్న అనుబంధం మూలానే "సంథింగ్ సంథింగ్" సినిమాలో రానా, సమంతాలు అతితులుగా సందడి చేశారు. అంతకు మించి ఈ పాత్రలతో కథకు ఏ మాత్రం అవసరం లేదు.