మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఎవడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. జంజీర్ కి కోర్టు సమస్యలు తొలిగిపోయాయి. మరి రెండు సినిమాల్లో ఏది ఫస్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మీ డౌట్. నిజానికి జంజీర్ మొదట రిలీజ్ అవ్వాల్సి వుంది. కానీ ఇపుడు వంశీ పైడి పల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఎవడునే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జూలైలో ఎవడు , ఆగస్టులో జంజీర్ విడుదల అవుతాయని సమాచారం. విశేషం ఏంటంటే ఎవడు, జంజీర్ సినిమాల ఆడియో ను ఇదే నెలలో ఒకే రోజు ఒకే చోట రిలీజ్ చేయబోతున్నారు.
ఇక జంజీర్ కోర్టు సమస్యలు సమసి పోవడంతో ఈ రోజు మెగాస్టార్ చిరుకి సినిమా మొత్తాన్ని హైదరాబాద్ లో చూపించారు అపూర్వ లఖియా. చిరు చూస్తున్నంత సేపు టెన్షన్ తో ధియేటర్ బయట నిలుచున్న డైరెక్టర్ అపూర్వ లఖియా సినిమా పూర్తయ్యాక చిరు ముఖంలో సంతోషాన్ని చూసి హ్యాపిగా ఫీలయ్యారట. సినిమాను బాగా తీశావని ...చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ అదిరిపోతుందని అపూర్వ లఖియాకు స్ట్రాంగ్ హగ్ కూడా ఇచ్చారట చిరు.
��
జనరల్ గా రామ్ చరణ్ ప్రతి సినిమాను చిరు ముందుగానే ప్రివ్యూ వేయించుకుని చూస్తారు. ప్రివ్యూ అయ్యాక చిరు హిట్ అన్నాడు అంటే ఇటు అభిమానులకి, అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఇపుడు చిరు నోట జంజీర్ హిట్ ఖాయమన్న మాట వచ్చింది. దీంతోబాలీవుడ్ లో చెర్రీకి ఎదురొచ్చేది ఎవడు అంటూ ఫ్యాన్స్ ముందుస్తుగా పండుగ చేసుకుంటున్నారు.