సిని వినీలాకాశం నుండి మరో దృవతార రాలిపోయింది. తన నటనతో , దర్శకత్వ ప్రతిభతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ప్రముఖ నటుడు, దర్శకులు మణివణ్నన్ ఈ రోజు గుండె పోటుతో కన్నుమూశారు.
దక్షిణాది బాషలన్నింట్లో నటించిన మణివణ్నన్ తెలుగువారికి పరిచయమే. . తెలుగులో ఆయన గుర్తిండిపోయే పాత్రలు ఎన్నో చేశారు. ప్రేమికుల రోజు, ఒకే ఒక్కడు, శివాజీ, మజా ,నరసింహా సినిమాల్లో తనదైన స్టైల్లో నటించి మెప్పించారు . . ముఖ్యంగా డైరెక్టర్ శంకర్, రజినీకాంత్ ప్రతి సినిమాల్లో కనిపించే మణివణ్నన్ దర్శకుడిగానూ సక్సెస్ అయ్యారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన యమ్.దర్శరాజు ఎం.ఎ తమిళ మాతృక మణివణ్ననే డైరెక్ట్ చేశారు.
��
కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా , దర్శకుడిగా దాదాపు రెండు దశాబ్దాలు ఫిల్మ్ ఇండస్ట్రీతో అనుబంధం వున్న మణివణ్నన్ మరి ఇక లేరు అనే వార్త తెలుగు, తమిళ, హిందీ సినిమా ప్రముఖులను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయనకు ఎపి హెరల్డ్ నివాళులు అర్పిస్తోంది.