సంజయ్ దత్ నటించిన యాక్షన్ ఫిల్మ్ పోలీస్ గిరి. తెలుగులో వచ్చిన లక్ష్మీ నరసింహాకు రీమేక్ ఫిల్మ్ ఇది. అక్రమంగా ఆయుధాలు కలిగి వున్న నేరంపై పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. అందులోనూ జైలుకి వెళ్లడానికి ముందు చేసిన సినిమా కాబట్టి ఆడియెన్స్ లో కూసింత ఆసక్తి వుంది. అయితే వచ్చే నెల 5న వాల్డ్ వైడ్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఇపుడు వివాదంలో ఇర్రుక్కుంది.
అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో నటించిన కవితావర్మ ఓ ఫోటోలో జపమాల ధరించి ఫోజులిచ్చింది. శిలువతో కూడిన ఆ జపమాల ధరించడంపై ముంబాయికి చెందిన కేధిలక్ సెక్యూలర్ ఫోరం తీవ్రంగా మండిపడింది. వెంటనే అభ్యంతరకర సన్నివేశాలను తొలిగించకపోతే సినిమా రిలీజ్ ను ఆపేస్తామని , కోర్టులో కేసు కూడా వేస్తామని ప్రొడ్యుసర్స్ కి, సెన్సార్ బోర్డ్ కి తెలియజేసింది ఆ సంస్ద.
అంతేకాదు జపమాలను క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారని, అలాంటి జపమాలను ఎటువంటి ఆఛ్చాదన లేని హీరోయిన్ యెదపై ఎలాంటి వేస్తారు..? ఇది క్షమించరాని నేరం అంటూ సీఎస్ ఎఫ్ ఆవేధన వ్యక్తం చేసింది. అయితే అభ్యంతరకర దృశ్యాలను పరిశీలించి తొలగిస్తామని పోలీస్ గిరి సినిమా నిర్మాత అగర్వాల్ తెలియజేశారు. అయితే సిఎస్ ఎఫ్ తన అభ్యంతరాల్ని వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి.