కొద్దిరోజుల క్రితమే దాసరి నారాయణ రావు తన పుట్టినరోజు సందర్భంగా వడ్డీ కాసులవాడు అంటూ ఓ మూవీని అనౌన్స్ చేసాడు. పాలిటిక్స్ ప్రక్కన పెట్టి పూర్తి టైం సినిమాలపై పెట్టాలని దాసరి ఫిక్స్ అయ్యాడని ఆ మధ్య న్యూస్ వినిపించింది. కానీ ప్రెజెంట్ దాసరి పరిస్థితి ఏమిటో తెలిసిన విషయమే. 
 
దాసరి పై, అతని ఆస్తులపై సిబిఐ సడెన్ గా రైడ్ చేయడంతో దర్శకరత్న ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. చేసిన తప్పు చేసి, పైగా సింపతి కోసం మెగా బురద జల్లెందుకు ఓ ప్రెస్ నోట్ ని కూడా విడుదల చేసిన దాసరి, సింపతి ఏమోగాని నవ్వులపాలు మాత్రం అయ్యాడు. ఎందుకంటే తాజా పరిస్తితుల్ని చూస్తుంటే, మెగా వారు తమ ఆస్తుల్ని కాపాడుకోవడానికే నానా తంటాలు పడుతుంటే, మళ్ళీ దాసరిపై కక్ష్య కట్టి దాడులు జరిపించారని అభియోగాలు వేయడం నిజంగా నవ్వు కాక మరేమిటి?
 
సరే  ఆ విషయం ప్రక్కన పెడితే ప్యూన్ గా ప్రభుత్వం పై ఆడుకోవాలని దాసరి ఆరంభించిన వడ్డీ కాసులవాడు, ప్రెజెంట్ పరిణామాలతో కథలోని ప్యూన్ పాత్రను సిబిఐ అధికారిగా మార్చేందుకు రచయితలు ప్రయత్నాలు మొదలెట్టారట. ఎందుకంటే దాసరి దర్శకత్వ బుర్ర ఈ పాటిదో ఇదివరకు వచ్చిన మేస్త్రిలోనే చూసాం కాబట్టి,అదీకాక ప్రెస్ నోట్లో త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానని దాసరి శపథం చేసాడు కాబట్టి, గ్యారంటీగా ఈ వడ్డీ కాసులవాడి కథ మారుతుందని చాలా మంది ఓ లెక్కకి వచ్చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: