కలలు కనమని.. ఆ కలలు సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని మాజీ రాష్ట్రపతి కలాం చెబుతుంటారు. నిజానికి అందరూ కలలు కంటారు. కానీ సాకారం కొద్దిమందే చేసుకుంటారు.. రంగుల ప్రపంచమైన మన ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ స్టార్స్ కలలు కన్నారు. అయితే కొద్దిమంది కలలు కలగానే మిగిలిపోయాయి. అందులో కమల్ హాసన్ కూడా వున్నారు . ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ మర్మయోగి ఓ కలగానే మిగిలిపోయింది.
7వ శతాబ్ధం బ్యాక్ డ్రాప్ తో మర్మయోగి కధ అల్లుకున్నాడు కమల్.. దాదాపు 120 కోట్ల బడ్జెట్ అవుతుందని లెక్కలు కూడా వేశారు. సాయి మీరా సంస్దతో కలసి తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కంబైన్డ్ గా మూవీ చేయాలని ప్లాన్ చేశారు కమల్. షూటింగ్ కు ముందే ట్రైలర్స్ షూట్ చేయించారు. శ్రీయ, త్రిష, శోభన హీరోయిన్స్ గా అనుకున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ బడ్జెట్ లిమిట్ దాటేస్తుందన్న అనుమానంతో సాయి మీరా సంస్ధ ప్రాజెక్ట్ నుండి జారుకుంది. దాంతో సినిమా అటకెక్కేసింది. అయితే ఈ మద్య దాదాపు 100కోట్ల బడ్జెట్ తో విశ్వరూపం తెరకెక్కించి సక్సెస్ అయిన కమల్ ఇపుడు విశ్వరూపం2 కూడా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు.
��
ఇక విశ్వరూపం రేంజ్ లో సీక్వెల్ కూడా ఆడితే మర్మయోగిని తెరపైకి తేవాలని కమల్ ప్లానట. ఎవరో ఎందుకు తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పైనే సినిమా చేస్తానని సన్నిహితులతో అంటున్నాడట. మరి విశ్వరూపం2 కమల్ ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ లోఆడుతుందా..?కమల్ కల నెరవేరుతుందా...? జస్ట్ వెయిట్ అండ్ సీ....