వరుస ప్లాపుల్లో ఉన్న ఇద్దరు సేలేబ్రేటీలు కలిసి పనిచేస్తే వారి జాతకం మరే అవకాశం ఉన్నదా? అంటే అవుననే ఉహాగానాలు వస్తున్నాయ్. ఇంతకీ వారిద్దరూ ఎవరంటే ఒకరు పూరిజగాన్నాద్, మరొకరు మాస్ మహారాజా రవితేజ ‘ఈడియట్’ సినిమాలాంటి సూపర్ హిట్ ఇచ్చిన వీరి కాంబినేషన్ విడివిడిగా కూడా చాలా విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం మాత్రం వీరిద్దరూ పరాజయాల నావలో ప్రయాణం చేస్తున్నారు.

వరుస పెట్టి 6 ఫైల్యూర్స్ తో అగమ్యగోచరంగా రవితేజా ఉంటే వరుస పెట్టి వచ్చిన మూడు పరాజయాలతో పూరి ప్రస్తుతం టాలీవుడ్ లేక బాలీవుడ్ అని ఆలోచిస్తున్నాడు. ఈ నెలాఖరుకు విడుదల కానున్న ‘బలుపు’ తో రవితేజా బలుపు తెలిపోనున్నది. ఈ పరిస్థితులో ఉన్న వీరిద్దరికీ ఒక మాస్టర్ ప్లాన్ తట్టిందట, వీరిద్దరి పరాజయాల చరిత్రకు బ్రేక్ వేయడానికి వారిద్దరూ ఒకటై ఒక సొంత సినిమా నిర్మాణం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నారట .

 దీనికి నిర్మాతగా రవితేజ బాధ్యతలు చేపడితే ఎంత కాదన్నా వీరిద్దరికీ ఉన్న పరిచయాలు, క్రేజ్ ను బట్టీ ఈ సినిమాను మార్కెట్ చేయడం సులువని భావిస్తున్నారట. ‘బలుపు’ సినిమా ఫలితం బట్టీ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. ఇంతకీ ఇద్దరూ కలిస్తే జాతకం మారేనా???

 

మరింత సమాచారం తెలుసుకోండి: