ఇదే నిజమైతే ఘట్టమనేని ఫ్యాన్ ఫాలోయింగ్ మెగా అభిమానులను మించి ఉండాలనేది మహేష్ కోరిక. దీన్ని ముందుగానే గమనించిన మెగా హీరోల సూత్రధారి, దీనికి చెక్ పెట్టే యోచనలో ఉన్నాడు. నందమూరి అభిమానులు కూడ మహేష్ నెంబర్.1 అని ఒప్పుకోవడానికి ఇష్టపడంలేదు.
అటు పొలిటికల్గా పద్మాలయ స్టూడియో లాండ్ మేటర్ను సి.ఎం మళ్ళీ తెరపైకి తీసుకువస్తున్నాడు. పద్మాలయ లాండ్ లీగల్గా ఇబ్బందుల్లో ఉంటే కృష్ణ,మహేష్బాబు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డితో సెటిల్మెంట్ను క్లియర్ చేసుకున్నారు. తాజా ఈ భూమిని జీ-స్టూడియోకు లీజ్కు ఇచ్చారని, ఇది చట్టవిరుద్దమని అందుకే పద్మాలయ లాండ్ మేటర్తో మహేష్ను ఇరకాటంలో పెట్టేందుకు అండర్ ఆపరేషన్ రెడీ చేస్తున్నారు.ప్రస్తుతానికి ఫారిన్ వెళ్ళిన మహేష్ బాబు తిరిగి వచ్చేసరికి ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ,అటు పొలిటికల్ లోనూ ప్రిన్స్ను టార్గెట్ చేసే పనిలో ఉంది.