బన్నీ “రేసుగుర్రం” ఆగిందా..? ఇప్పుడు ఇదే వార్తలు ఫిల్మ్ నగర్ లో హాల్ చల్ చేస్తున్నాయి. సురేంద్ర రెడ్డి – అల్లు అర్జున్ ల క్రేజీ కాంబినేషన్ లో “రేసుగుర్రం” పట్టాలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలు కు ఎందుకు ఆలస్యం అవుతోంది..? అనే సందేహాలు ఫిల్మ్ నగర్ లో, బన్నీ అభిమానులలో వినిపిస్తున్నాయి. దర్శకుడు సురేంద్ర రెడ్డి బన్నీ కి వినిపించిన ఫైనల్ స్క్రిప్ట్ లో అంతగా పసలేకపోవడంతో బన్నీ యే కొన్ని సూచనలు చేసి కధ మార్చమని అన్నాడట.

 సీన్ తరువాత సీన్ అన్నట్లుగా కాక కధలో డెప్త్ ఉండాలని బన్నీ సూచించాడట. దానితో దర్శకుడు రచయిత వంశీ తో కలిసి ఈ పనిలో పడ్డాడని టాక్. దీనివల్లే రేసుగుర్రం పట్టాలు ఎక్కడం లేటు అవుతుందని అంటున్నారు. అయితే సురేంద్ర రెడ్డి గత సినిమాలను పరిశీలిస్తే కధ విషయంలో అంతగా పెద్ద డెప్త్ కనిపించదు. రవితేజ కామెడీ టైమింగ్ కలిసివచ్చి, కిక్ సినిమా హిట్ అయింది కాని అది సురేంద్ర రెడ్డి గొప్పతనం వల్ల కాదు అనే టాక్ కూడా ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కధలో ఇమిడిపోయే ట్విస్ట్ లు ఉండేట్టుగా బన్నీ కి నచ్చిన విధంగా సురేంద్ర రెడ్డి కధను తయారు చేయగలుగుతాడో లేదో చూడాలి.

 “ఇద్దరమ్మాయిలతో..” విషయంలో కూడా కధలో సరైన పట్టు లేకపోవడంతో అల్లు అర్జున్ కోరుకున్న బ్లాక్ బస్టర్ స్థాయి కి ఆ సినిమా చేరలేకపొయింది. ఈ సినిమా విషయంలో కూడా బన్నీ పూరి జగన్నాధ్ కు రకరకాల సలహాలు ఇచ్చాడని రూమర్. మరి ఈ రేసుగుర్రం విషయంలో బన్నీ ఇచ్చిన సలహాలు ఎంత వరకూ ఈ సినిమా విజయానికి సహాయపడతాయో చూడాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: