కాల్షీట్ల సమస్య వల్ల దాన్నీ వదులుకొంది.ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆ ఛాన్స్ అందిపుచ్చుకొంది తమన్నా. మహేష్బాబు తదుపరి చిత్రం ఆగడులో కథానాయికగా ఎంచుకొన్నారు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం ఫామ్లో లేదు. ఆమె నటించిన సినిమాల్నీ బోల్తా పడ్డాయి. బాలీవుడ్లోనూ హిట్ కొట్టలేకపోయింది.
కనీసం ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్బాబు సినిమాతో అయినా తమ్మూ మళ్లీ హిట్ కొట్టాలని తహతహలాడుతోంది.ఆగస్టులో ఆగడు సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మరో కథానాయికకీ ఛాన్స్ ఉందని సమాచారం. ఆ స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి.