నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వ‌ను.. సృష్టిస్తా - అంటాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో. అందుకే ఇప్పుడు అత‌న్ని అవార్డులు ఫాలో అవుతున్నాయి. మాటీవీ ప్ర‌క‌టించిన అవార్డుల్లో ఎక్కువ శాతం గ‌బ్బ‌ర్‌సింగ్‌కే వెళ్లిపోయాయి. ప్ర‌తీ యేడాదీ మాటీవీ సినిమా రంగంలో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టుల‌కు,

సాంకేతిక నిపుణుల‌కూ అవార్డులు అందిస్తుంది. ఈసారి గ‌బ్బ‌ర్‌సింగ్‌కి ఎక్కువ అవార్డులు ద‌క్కాయి.
ఉత్త‌మ న‌టుడు పుర‌స్కారం ప‌వ‌న్ కల్యాణ్‌కి ద‌క్కింది. హ‌రీష్‌శంకర్ (ద‌ర్శ‌క‌త్వం), దేవీశ్రీ ప్ర‌సాద్ (సంగీతం) పుర‌స్కారాలు అందుకొన్నారు. ఉత్త‌మ చిత్రంగానూ గ‌బ్బ‌ర్‌సింగ్ అవార్డు కొట్టేసింది.

ఉత్త‌మ కామిక్ ఎపిసోడ్‌గా అత్యాంక్ష‌రి ఎపిసొడ్ ఎంపికైంది.
గ‌బ్బ‌ర్‌సింగ్‌తో పాటు నాగార్జున ఢ‌మ‌రుకం కీ పుర‌స్కారాలు అందాయి. నాగార్జున‌కు జ్యూరీ పుర‌స్కారం ల‌భించింది. కాజ‌ల్‌కి ఉత్త‌మ న‌టి (తుపాకి) అవార్డు ద‌క్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: