గ‌బ్బ‌ర్‌సింగ్‌గా ప‌వ‌న్ చేసిన హంగామా అభిమానుల గుండెల్లో ఇంకా మార్మోగుతూనే ఉంది. ప్ర‌తి మాట‌, ప్ర‌తి పాటా... ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు గ‌బ్బ‌ర్‌సింగ్ 2 కూడా సిద్ధ‌మైపోతోంది. రామ్‌చ‌ర‌ణ్‌తో ర‌చ్చ చేయించిన సంపత్-నంది  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ సంస్థ నిర్మించ‌నుంది.  ఈ చిత్రానికి ప‌వ‌న్ స్వ‌యంగా క‌థ స‌మ‌కూర్చ‌డం విశేషం.

స్ర్కీన్‌ప్లే బాధ్య‌త‌లూ త‌నే చూసుకొంటున్నాడ‌ట‌.. ప్ర‌స్తుతానికి స్ర్కిప్టు  సిద్ధ‌మైంది. క‌థానాయిక ఎంపిక జ‌రుగుతోంది. తొలుత శ్రుతిహాస‌న్‌, స‌మంత పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. అయితే ఇప్పుడు వారి స్థానంలో మ‌రో నాయిక కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది.  అత్తారింటికి దారేది సినిమా పూర్త‌యిన వెంటనే గ‌బ్బ‌ర్ సింగ్ 2 సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రానికీ దేవినే సంగీతం అందిస్తాడ‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: