వ‌రుడు సినిమా గుర్తొందా?  అందులో క‌థానాయిక‌గా ఎంట్రీ ఇచ్చింది భాను శ్రీ మెహ‌తా. పోస్ట‌ర్ల‌లో ఈ అమ్మ‌డి ముఖార‌విందాన్ని క‌నిపించ‌కుండా ఊరించారు. తీరా..అస‌లు బొమ్మ చూస్తే జ‌నాల దిమ్మతిరిగిపోయింది. ఇంత‌టి అందానికి అంత బిల్డ‌ప్పా అనుకొన్నారు. దాంతో పాటు ఆ సినిమా దారుణంగా బోల్తా ప‌డ‌డంతో భాను శ్రీని ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఇంత కాలానికి.. అంతా నీమాయ‌లోనే సినిమాలో న‌వదీప్‌తో క‌లిసి న‌టిస్తోంది.అంతేకాదు... త‌మిళ చిత్ర‌సీమ నుంచి కూడా భానుకు అవ‌కాశాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం ఓ త‌మిళ సినిమాలో న‌టిస్తోంది. ``తొలి సినిమా చేసిన‌ప్పుడు ఎన్నో అంశాలు గ‌మ‌నించాను. ఓ సినిమా కోసం టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డుతుందో అర్థ‌మైంది.

ఈ విరామంలో న‌ట‌న‌పై మరింత అవ‌గాహ‌న పెంచుకొన్నాను. చాలా త‌మిళ సినిమాలు చూశా. ఎలా న‌టించాలో అర్థ‌మైంది. ఈసారి ఎట్టిప‌రిస్థితుల్లోనూ అవ‌కాశాల‌ను వృథాగా పోనివ్వను..`` అని చెప్పుకొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: