ఆ ఘ‌న‌త రాజ‌మౌళి ఈగ‌కు రెండోసారి ద‌క్కింది. ఇటీవల కాన్స్ చిత్రోత్సవాల్లో ఈగ చిత్రాన్ని ప్ర‌దర్శించారు. ఇప్పుడు షాంఘై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు కూడా  ఎంపికైంది.

మన దేశంలో రూపొందిన కొన్ని హిందీ చిత్రాలతో పాటు "ఈగ"  అక్కడ ప్రదర్శితం కాబోతోంది.ఈ చిత్రోత్సవాలలో దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొంటున్నారు. శనివారం రాజ‌మౌళి  షాంఘై బయలుదేరి వెళ్ళారు. ఈగ ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు, అక్కడ "బాహుబలి"కోసం కొన్ని లొకేషన్లను పరిశీలిస్తారట రాజమౌళి. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఉంచారు. 

బాహుబలి ఆల‌స్యం అయిపోతోంద‌ని ఓ వైపు బాధ ప‌డుతుంటే, రాజ‌మౌళి మాత్రం ఇంకా ఈగ వెంటే ప‌డడం.. ప్ర‌భాస్ అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు. ఈ సినిమా ఇలాగే ఆల‌స్యం అయితే.. వచ్చిన క్రేజ్ ఎక్క‌డ త‌గ్గిపోతుందో అని ప్ర‌భాస్ ఫ్యాన్స్ బెంగ పెట్టుకొన్నారు. మ‌రి రాజ‌మౌళి ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: