మన దేశంలో రూపొందిన కొన్ని హిందీ చిత్రాలతో పాటు "ఈగ" అక్కడ ప్రదర్శితం కాబోతోంది.ఈ చిత్రోత్సవాలలో దర్శకుడు రాజమౌళి కూడా పాల్గొంటున్నారు. శనివారం రాజమౌళి షాంఘై బయలుదేరి వెళ్ళారు. ఈగ ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు, అక్కడ "బాహుబలి"కోసం కొన్ని లొకేషన్లను పరిశీలిస్తారట రాజమౌళి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో ఉంచారు.
బాహుబలి ఆలస్యం అయిపోతోందని ఓ వైపు బాధ పడుతుంటే, రాజమౌళి మాత్రం ఇంకా ఈగ వెంటే పడడం.. ప్రభాస్ అభిమానులకు నచ్చడం లేదు. ఈ సినిమా ఇలాగే ఆలస్యం అయితే.. వచ్చిన క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ బెంగ పెట్టుకొన్నారు. మరి రాజమౌళి ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.