ఇప్పుడు పవన్ కల్యాణ్ స్పెయిన్లో తిష్టవేశాడు. ఫైటింగుల కోసం.పవన్-త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం అత్తారింటికి దారేది. సమంత కథానాయిక. ప్రస్తుతం స్పెయిన్లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ కీలకమైన పోరాట దృశ్యాలు తెరకెక్కిస్తున్నారు. స్పెయిన్ వీధుల్లో పవన్... ఫైట్ చేస్తున్నాడిప్పుడు. ఈనెలాఖరు వరకూ అక్కడే షూటింగ్ జరగనుంది.
వచ్చేనెల 2వ తారీఖున... చిత్రబృందం ఇండియా తిరిగిరానుంది.ఇక్కడికి వచ్చిన తరవాత అత్తారింటికి దారేది ఫస్ట్లుక్ని విడుదల చేస్తారట. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిచాడు. దేవి పవన్ కోసం మరోసారి అదిరిపోయే అల్బమ్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది.