ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌హేష్‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల మ‌ధ్య భీక‌ర‌మైన పోటీ న‌డుస్తోంది. పారితోషికంలోనూ, స్టార్ హోదాలోనూ ఇద్ద‌రూ త‌క్కువ కాదు. ఇప్పుడు శాటిలైట్ హ‌క్కుల విష‌యంలోనూ పోటీ ప‌డుతున్నారు. గ‌బ్బ‌ర్‌సింగ్ హ‌క్కులు అత్య‌ధిక రేటుకు అమ్ముడిపోయి రికార్డ్ సృష్టించింది. దాన్ని సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్రాస్ చేసింది. 

తాజాగా అత్తారింటికి దారేది సినిమాని ఏకంగా రూ.9 కోట్లకు అమ్మేశారు. ఈ రికార్డు ఇప్ప‌ట్లో బ‌ద్ద‌లు కొట్ట‌డం అసాధ్యం అనుకొన్నారంతా. అయితే మ‌హేష్ సినిమా `1 - నేనొక్క‌డినే` ప‌వ‌న్ సినిమాకి పోటీగా వచ్చేసింది. ఈసినిమా శాటిలైట్ హ‌క్కుల్ని రూ. 10 కోట్ల‌కు కొనుగోలు చేయ‌డానికి ఓ ఛాన‌ల్ విశ్వ‌ప్ర‌య‌త్నాలూ చేస్తోంది.

ఆ రేటుకు వ‌న్ అమ్మేస్తే... శాటిలైట్ హ‌క్కుల‌లోనూ నెంబ‌ర్ వ‌న్ హీరో మ‌హేష్ అవుతాడు.మొత్తానికి ఈ క‌థానాయ‌కుల మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్తరంగా న‌డుస్తోంది. ఒక‌రి రికార్డును మ‌రొకరు బ్రేక్ చేసుకోవ‌డం.. మంచి పోటీని నిదర్శ‌నం. మ‌రి ఈ ఇద్ద‌రికి ధీటుగా నిలిచే హీరో ఎప్పుడు వ‌స్తాడో?

మరింత సమాచారం తెలుసుకోండి: