నందమూరి హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన త్రీడి సినిమా ‘ఓమ్’ పై సూపర్ స్టార్ రజినీకాంత్ మనసు పడ్డాడు. ‘అవతార్’ లాంటి భారీ హాలీవుడ్ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులతో కళ్యాణ్ రామ్ నిర్మించిన సినిమా విడుదలకకుండానే దక్షణాది చలనచిత్ర సినిమా రంగంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారడంతో ఈ సినిమాను ప్రత్యేకంగా తన కుటుంబ సభ్యులతో చూడటమే కాకుండా ఈ సినిమాను తాను తమిళంలో తన అల్లుడు ధనుష్ ను హీరోగా పెట్టుకుని రీమేక్ చేస్తానని దానికి అనుమతి ఇవ్వవలసిందిగా రజనీ కళ్యాణ్ రామ్ ను కోరాడట.

అంతేకాదు దాదాపు 30 కోట్ల భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మించిన కళ్యాణ్ రామ్ సాహసాన్ని అభినందించి ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ తన ‘కొచ్చాడియన్’ సినిమాను తలపించే స్థాయి లో ఉన్నాయని మెచ్చుకోవడమే కాకుండా సూపర్ స్టార్ రజినీ నందమూరి వంశం పై ప్రశంసల వర్షం కురిపించాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి: