పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ కూడా వార్తలకు ఎక్కుతోంది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రేణు పవన్ తో వివాహం అయిన తరువాత నటనకు దూరమైంది. ఈ మధ్య పవన్ రేణు దేశాయ్ ల మధ్య సరైన సంబందాలు లేవని అనేక రకాల రూమర్లు రావడం మనకు తెలిసిన విషయమే.

స్టైలిష్ హీరోయిన్ గా పేరున్న రేణు ప్రస్తుతం నిర్మాతగా, ఒక మరాఠీ సినిమాను నిర్మించబోతోంది. ఆ సినిమా పేరు ‘మంగళాస్తకే వన్స్ మోర్’ ఈ సినిమాలో స్వప్నిత్ జోషీ, ముక్తా బరవే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య పెరిగిపోతున్న అభిప్రాయాల అఘధాన్ని అలాగే వారిద్దరి మధ్య తరిగి పోతున్న ప్రేమానురాగాలనూ ఈ సినిమా కధ గా చూపెడతానని చెపుతోంది. రేణు దేశాయ్ పుట్టిందీ, పెరిగిందీ అంతా పూనా నేపధ్యమే కాబట్టి తన మొట్టమొదటి సినిమాగా ఈ మరాఠీ సినిమాను తీస్తున్నానని చెపుతోంది .

ఈ వార్తను విన్న ఫిలింనగర్ వర్గాలు మాత్రం ఈ సినిమా కధ పూర్తిగా రేణు దేశాయ్ వ్యక్తిగత జీవితమేననీ తనకూ తన భర్త పవన్ కు  మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను ఈ సినిమా టార్గెట్ చేస్తుందని అంటున్నారు. ఇందులో ఎన్ని నిజాలో తెలియవు కాని, రేణు దేశాయ్ మాత్రం నిర్మాతగా మారిపోతోంది...

మరింత సమాచారం తెలుసుకోండి: