ఎన్ని ఫ్లాపులు ఇచ్చినా, ఎన్ని విమర్శ‌లు చుట్టిముట్టినా పూరి జ‌గ‌న్నాథ్‌పై నిర్మాత‌లకూ, హీరోల‌కూ న‌మ్మ‌కాలు పోవ‌డం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ పూరితో సినిమా చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. నాగబాబు కూడా త‌న త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్‌ని పూరి చేతిలో పెట్ట‌డానికే డిసైడ్ అయ్యాడు. ఈ చిత్రానికి అశ్వనీద‌త్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. 

ప్ర‌స్తుతం పూరి ఈ సినిమా క‌థ గురించి తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నాడ‌ట‌. సినిమాకి క‌థ అవ‌స‌రం లేదు, క‌థ చెబితే జ‌నాలకు బోర్ కొడుతుంది అనే పిచ్చ స్టేట్ మెంట్లు ఇచ్చిన పూరి క‌థ‌పై క‌స‌ర‌త్తు చేయ‌డం కొత్త‌గానే ఉంది. అంతేకాదు.. ఈ సినిమాని త‌న మొద‌టి సినిమాగా భావించి.. క‌ష్ట‌ప‌డుతున్నాడ‌ట‌.పూరి సాధించిన విజ‌యాలు ఇప్పుడు గతం.

మా తాత‌లు నేతులు తాగారు.. అని గొప్ప‌లు చెప్పుకొంటే కుద‌రదు. త‌న‌ని తాను నిరూపించుకోవాలి, త‌న‌లో స‌త్తా ఇంకా త‌గ్గ‌లేద‌ని చాటుకోవాలి. దానికి పూరి చేతిలో ఉన్న ఏకైక అవ‌కాశం

మరింత సమాచారం తెలుసుకోండి: