సినిమా వాళ్ళ జీవితాలు అంటేనే పుకార్లమయం అప్పడిదాక సెలెబ్రిటీలను అభిమానించిన అభిమానులే చిన్న తేడా వచ్చినా పాతాళంలోకి దింపేస్తారు. అందుకే వారి జీవితాలను అద్దాలమేడ తో పోలుస్తారు. మంచు వారి ఫ్యామిలీ అంతా కలిసి ఓ భారీ సినిమాని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే కదా! మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు ఇంతవరకూ ఒక తెర మీద కనిపించలేదు కాబట్టి, ఈ సినిమా మీద జనానికి ఆసక్తి కూడా ఏర్పడింది. అయితే ఇప్పడు లక్ష్మీప్రసన్న కూడా ఇందులో నటిస్తోందని అంటున్నారు. మొన్నటివరకూ లేనిది, ఇంత సడెన్ గా ఆమెనెందుకు దించారో ఎవరికీ అర్థం లేదు.

నిర్మాతగా కెరీర్ ప్రారంభించినా, నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది లక్ష్మి.అలాంటిది ఆమెనెందుకు తీసుకోలేదు, తండ్రీకొడుకులు మాత్రమే ఎందుకు నటిస్తున్నారు అన్న సందేహం మొదట్లోనే మీడియా వర్గాలలో వచ్చింది. అదే అడిగితే, ఆమె ఓ ఇంగ్లీషు సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల ఇక్కడ చేయలేని పరిస్థితి అని చెప్పాడు కలెక్షన్ కింగ్. అంతా నిజమే అనుకున్నారు. కానీ ఇప్పుడేమో సడెన్ గా లక్ష్మి కూడా చేస్తోంది అని ప్రకటించేశారు. అసలు విషయం ఏమిటంటే లక్ష్మిప్రసన్ననటించకపోవడం వల్ల నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటున్నారట. వారి కుటుంబంలో ఏవో సమస్యలు వచ్చాయని, అవి తారస్థాయికి చేరడంతో లక్ష్మి వీరికి దూరమయ్యిందని, అందువల్లే ఈ మధ్య  ఆమె అమెరికా వెళ్ళిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ విషయం మోహన్ బాబు దృష్టికి కూడా రావడంతో  చెవిన కూడా పడటంతో  లక్ష్మితో మాట్లాడి వెంటనే రప్పించాడట .

ఆమె కోసం ఓ పాత్రను సృష్టించమని డైరెక్టర్ తో చెప్పారట. అతడు పాపం స్ర్కిప్టు మొత్తం మార్పులు చేసుకుని, మేడమ్ గారి కోసం ఓ రోల్ క్రియేట్ చేశాడట. 'గుండెల్లో గోదారి’ సినిమా తరువాత లక్ష్మి ప్రసన్న తను ఇప్పట్లో ఎ సినిమాలలోను నటించాను అని చెప్పింది. కానీ తండ్రి కోరిక మేరకు మనసు మార్చుకుని లక్ష్మిప్రససన్న మంచు వారి సినిమాలో ఏ పాత్ర చేస్తుందో చూడాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: