సమంతా తమన్నా ప్రస్తుతం ఈ రెండు పేర్లతో జపం చేస్తున్నారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ గా ఉన్న వీరిద్దరూ రాజధానిలో జరిగే ఏ ఫిలిం ఫంక్షన్ కు వచ్చినా కెమెరాలకు బిజీ ప్రేక్షకులకు జోష్. మొన్న శనివారం రాజధానిలో జరిగిన మాటివి అవార్డ్స్ కార్యక్రమానికి వీరిద్దరూ వస్తారని అటు నిర్వాహకులు, ఇటు మీడియా ఎదురుచూసింది. కానీ వారిద్దరూ రకరకాల సాకులు చెప్పి డుమ్మా కొట్టారు.

సమంత కెరియర్ ప్రారంభంలో ఆమె టాలీవుడ్ సెలిబ్రిటీ గా మారాడనికి మాటివి ఎంతగానో ప్రమోట్ చేసింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నకైతే మెగా ఫ్యామిలీ హీరోలందరూ తమ సినిమాలలో తమన్న కు అనేక అవకాశాలు యిచ్చి ఆమె క్రేజ్ ను పెంచారు. అంతేకాదు అక్కినేని నటవారసుడు నాగచైతన్య సూపర్ హిట్ సినిమాలలో కూడా వీరిద్దరే నాయికలు. చైతూ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో కూడా ఈ బ్యూటీలే హీరోయిన్స్  .

ఈ అంశాలను దృష్టిలో పెట్టికుని మాటివి యాజమాన్యం వీరిద్దరిని అవార్డు ఫంక్షన్ కోసం ప్రత్యేకoగా ఆహ్వానించినా తమన్నా బిజీ, సమంతా తల నొప్పి వంకలతో తప్పించుకున్నారు. కానీ వీరిద్దరితో సినిమాలు చేస్తున్న హీరోచైతూ మాత్రం,హీరోయిన్స్ ఇద్దరు వస్తారని తెగ ఎదురు చూసాడట. అయ్యో పాపం హీరో చైతూ.... 

మరింత సమాచారం తెలుసుకోండి: