మహేష్ బాబు సినిమా "ఆగడు"లో కథానాయికగా తమన్నా అంటూ రెండు రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అదంతా గాలి వార్తలేనట. ఈ సినిమాలో హీరోయిన్  ఎవరో ఇంకా ఖరారు కాలేదట.   ప్రస్తుతం కథా చర్చలు మాత్రమే సాగుతున్నాయని చిత్ర బృందం చెబుతోంది.ఈ విషయం గురించి నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ "ఈ సినిమాలో కదానాయికగా తమన్నా ని ఎంపిక చేసుకున్నాం అనే మాటల్లో నిజం లేదు. 

ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. అయితే ఆ జాబితాలో తమన్నా పేరు కూడా వుంది.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 1 సినిమాకోసం మహేష్ లండన్లో ఉన్నారు. ఆయనతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామ"న్న
అంటే ఈ సినిమాలో కధానాయిక ఎవరో నిర్ణయించాల్సింది మహేష్ బాబునే అన్నమాట.

ప్రిన్స్ తమ్ము కె ఓటేస్తే, తమన్నా అదృష్టవంతురాలే. తమన్నా కంటే మహేష్ కి మంచి ఛాన్స్ దొరక్కపోవచ్చు. ఎందుకంటే కధానాయికల కొరత ఆ రేంజు లో వుంది. ఈ సస్పెన్స్ వీడాలంటే మహేష్ లండన్ నుంచి ఇండియా రావాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: