గోకులంలో సీత, శుభాకాంక్షలు, స్నేహితులు, ప్రేయసి రావే -  ఇలా  ఎన్నో సినిమా లలో తన నటనతో, అందం తో మురిపించింది రాశి. నిజం సినిమా లో వ్యాంప్ అవతారం కూడా ఎత్తింది. పెళ్లి చేసుకున్నాక మాత్రం నటనకు  పూర్తిగా దూరమైపోయింది. భర్త తో  కలిసి నిర్మాణరంగంలోకి  అడుగుపెట్టింది.బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అవేమీ రాశి కి కలసి రాలేదు. 

ఇంతకాలానికి మళ్ళీ సినిమా ల్లోకి అడుగు పెట్టింది.  మొగలిరేకులు సీరియల్లో నటించిన సాగర్ కథానాయకుడిగా  ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాజేంద్రప్రసాద్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాజేంద్రుడి తో జోడి కట్టబోతుంది  రాశి. రాజేంద్రుడి తో ఇది మూడో సినిమా ఆమెకు. తెలుగు చిత్ర సీమలో రోజుకో కొత్త అమ్మాయి కధానాయికగా వస్తోంది.

తమన్నా, కాజల్, సమంత వీళ్ళ జోరు ఎలాగు కొనసాగుతూనే వుంది. వీళ్ళ మధ్య రాశి  మళ్ళీ నిలదొక్కు కోవడం అంటే మాటలు కాదు. మరి ఈ సవాల్ ఎలా స్వీకరిస్తుందో  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: