బాహుబ‌లి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బ‌డ్జెట్‌లోనూ, పారితోషికం విష‌యంలోనూ అన్నిటా బాహుబ‌లిదే రికార్డు. ఈ సినిమా కోసం రూ.100 కోట్లు బ‌డ్జెట్ కేటాయించార‌ట‌. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న చిత్రం ఇదే. పారితోషికాలూ గ‌ట్టిగానే ముట్టాయి అంద‌రికీ. రాజ‌మౌళి ఏకంగా రూ.20 కోట్లు తీసుకొన్నాడ‌ట‌. ప్ర‌భాస్‌కి రూ.16 కోట్లు అందాయ‌ని స‌మాచారం.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాలో కథానాయిక‌గా న‌టిస్తున్న అనుష్క‌కి కూడా భారీ మొత్తంలో పారితోషికం అందింద‌ట‌. బాహుబ‌లి కోసం ఆమెకు అందిన మొత్తం రూ. 2 కోట్లు అని తెలిసింది. ఈ మాటే నిజ‌మైతే ద‌క్షిణాదిన అత్య‌ధిక పారితోషికం అందుకొన్న క‌థానాయిక అనుష్క‌నే అవుతుంది. గుణ‌శేఖ‌ర్ సినిమా రుద్ర‌మ‌దేవికి కూడా ఇదే స్థాయిలో ఆమె పారితోషికం తీసుకొంద‌ట‌.న‌య‌న‌తార కూడా త‌క్కువేం కాదు.

క‌హానీ సినిమా కోసం ఆమెకు కూడా రూ.1.5 కోట్లు ద‌క్కాయ‌ట‌. త్రిష ప్ర‌స్తుతం 1.25 కోట్లు డిమాండ్ చేస్తోంద‌ట‌. ఇలియానా తెలుగు సినిమాలు చేయ‌డం లేదు గానీ, చేస్తే ఆమెకూడా న‌య‌న‌, స్వీటీల‌కు ఏమాత్రం తీసిపోదు. క‌థానాయిక‌ల డిమాండ్ అలా ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: