మిథున్ చ‌క్ర‌వ‌ర్తి... బాలీవుడ్ సినిమాలు త‌ర‌చూ చూసేవారికి త‌ప్ప‌కుండా ఈయ‌న గుర్తుంటారు. బాలీవుడ్‌కి కొత్త ర‌కం డాన్సులు ప‌రిచ‌యం చేసిన‌వారిలో మిథున్ కూడా ఒక‌రు. జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు కూడా అందుకొన్నారు. ఇప్పుడు తొలిసారి తెలుగు తెర‌పై క‌నిపించ‌బోతున్నారు. ఔను.. ఆయ‌న ఓ తెలుగు సినిమాలో న‌టించ‌డానికి త‌న సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.రవిరాజా పినిశెట్టి కుమారుడు స‌త్య పనిశెట్టి ద‌ర్శ‌కుడిగా మారారు.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త‌మ్ముడు ఆది పినిశెట్టి క‌థానాయ‌కుడు. ఈ సినిమాలో ఓ ప్ర‌త్యేక పాత్ర కోసం మిథున్‌ని సంప్ర‌దించారు. నిజానికి మిథున్‌కి టాలీవుడ్‌లో ఓ సినిమా చేయాల‌నే ఆలోచ‌న లేద‌ట‌. స‌త్య అడిగిన‌ప్పుడు - సారీ చెప్పార‌ట‌.
ఆ త‌ర‌వాత స‌త్య చెప్పిన క‌థ విని...

త‌ప్ప‌కుండా న‌టిస్తా అని మాట ఇచ్చార‌ట మిథున్‌. ``మిథున్‌లాంటి గొప్ప న‌టుడికి మా క‌థ న‌చ్చింది. దానికంటే సంతోషించ‌ద‌గిన విష‌యం మ‌రేం ఉంటుంది?  మిథున్ పాత్ర అంద‌రికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నాం`` అని స‌త్య పినిశెట్టి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: