మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ తరువాత టాలీవుడ్ లో పేరడీ స్టార్ గా సంపూర్నేష్ బాబు విజృంభిస్తున్నాడు. టీజర్లతో హడావిడి చేస్తున్నాడు. అభిమానుల చేత కెవ్వు కేక పెట్టిస్తున్నాడు. హృదయ కాలేయం లేటెస్ట్ టీజర్ చూస్తే మహేష్, బాలయ్య, పవన్, ప్రభాస్ ఇలా టాప్ హీరోలందరు ఖంగు తినటం ఖాయం. ఈ టీజర్లో బాలకృష్ణ, మహేష్బాబులకు ధీటుగా డైలాగులు చెప్పాడు ఈ బర్నింగ్ స్టార్.
నరకడం మొదలెడితే – నరకంలో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి అంటాడు దూకుడు లో మహేష్బాబు. నేను నరకడం మొదలెడితే ఏ ముక్క ఎక్కడుందో వెతుక్కోవడానికి వారం పడుతుంది అంటాడుబాలయ్య. ఇప్పుడు సంపూర్ణ బాబు వీళ్లకు ధీటుగా హృదయ కాలేయంలో ఓ డైలాగ్ చెప్పాడు. ఒరేయ్.. నేను కత్తి పట్టి నరకడం మొదలెడితే ముక్కలేరుకోవడానికి ప్రొక్రైన్లు రావాలి, రక్తం ఏరులై పారడానికి డ్రైనేజీలు తవ్వాలి ఇదీ అతని డైలాగ్స్. ఎంత పవర్ఫుల్ డైలాగ్స్ కదూ. ఇతని చిత్ర విచిత్ర విన్యాసాలు సంపూర్ణంగా చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.
అదృష్టం కలిసివచ్చి ఈ సంపూర్ణ బాబు సుదిగాడిలా మారిపోతే మరి ఇప్పటికే ఉన్న టాలీవుడ్ సుడిగాడు మరియు ఇతర హీరోల పరిస్థితి ఏమిటో....??