రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాకు జూలై సెంటిమెంట్ ఉందా? అందుకునే నిర్మాత దిల్ రాజ్ కానీ, హీరో చెర్రీ కానీ, కావాలని పట్టుపట్టి ఈ సినిమాను జులైలో తీసుకు రావడానికి ప్రధాన కారణం ఉందని అంటున్నారు. ఆ ప్రధాన కారణం ఒక బలమైన సెంటిమెంట్.

సెంటిమెంట్ లకు పెద్ద పీట వేసే సినిమా రంగంలో వాటి గురించి వింటే ఆశ్చర్యం వేస్తుంది.  మెగాస్టార్‌ కెరియర్‌ను అమాంతం పైకి నెట్టిన సినిమా ‘పాపం పసివాడు’. ఆ సినిమా జులైలోనే విడుదలైంది. అలానే  చిరు నటించిన ఇంద్ర, శంకర్‌దాదా జిందాబాద్‌, హిందీ గ్యాంగ్‌లీడర్‌ అదే నెలలో వచ్చి ఆయన ఇమేజ్‌ను ఒక రేంజ్‌లోకి తీసుకెళ్ళాయి. ఇకపోతే జులైలో వచ్చిన పవన్‌కళ్యాణ్‌ తొలిప్రేమ, తమ్ముడు సినిమాలో ఆయన్ను  పవర్‌స్టార్‌ను చేశాయి. అలానే చరణ్‌ గత సినిమాలు చిరుత, మగధీర కూడా అదే నెలలో రిలీజ్‌ కావడం విశేషం .

ఈ లెక్కన చూసుకుంట జూలైలో విడుదలైన మెగా హీరోల సినిమా ఏదైనా ఇటు  ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఇదే సెంటిమెంట్ ను మనసులో పెట్టుకుని హీరో రామ్ చరణ్ ఈ సినిమాను ఎత్తి పరిస్తుతులలోను జూలైలో రిలీజ్ చేయాలనీ నిర్మాత దిల్ పై ఒత్తిడి చేస్తున్నాడట. సెంటిమెంట్ కలిసొచ్చి ‘మగధీర’ లా ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అయితే ఇక చెర్రీ కి తిరుగు లేకపోవడమే కాకుండా వరుసగా మూడు విజయాలను కొల్లగొట్టిన మెగా హీరోగా మిగిలిపోతాడు...

మరింత సమాచారం తెలుసుకోండి: