రామ్‌చ‌ర‌ణ్ ఎవడు మూవీ ఆడియో ఫంక్షన్ జూన్ ఎండింగ్‌లో ఉండ‌టంతో, ఈ మూవీకు సంబంధించిన కొన్ని సాంగ్స్ పిక్చరైజేష‌న్ మిగిలివుంది. అందుకే ఈ నెల 27న రామోజిఫిల్మ్ సిటిలో రామ్ చ‌ర‌ణ్ పై ఓ సాంగ్ పిక్చరైజేష‌న్‌ను చేస్తున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, అమీ జాక్సన్ యాక్ట్ చేస్తుంది. ఇదే మూవీలో కొన్ని నిముషాల పాటు అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ జంటగా కీల‌క పాత్రలో న‌టిస్తున్నారు. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వ‌హిస్తుంటే దిల్‌రాజు మూవీను నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన ఓ సాంగ్ యూట్యూబ్‌లో హ‌ల్ చేస్తుంది. బ‌హుశా ఈ సాంగ్‌ను కూడ రిషూట్ చేసే అవ‌కాశం ఉంద‌ని దిల్ రాజు చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: