రాంగోపాల్ వర్మ‌.. సినిమాను డైరెక్ట్ చేసినా..ప్రొడ్యూస్ చేసినా..అస‌లేం చేయ‌కున్నా సెన్సేష‌నే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవ‌ర్సీతో వార్తల్లో వుండే వ‌ర్మ ఇపుడు రూటు మార్చి ఓ సినిమా తీశాడు. ఇదిగో అమ్మాయిలు ....ఈ సినిమా మీకోసమే తీశా త‌ప్పరండి అంటూ ఆహ్వనం కూడా ప‌లుకుతున్నాడు. ఏందేంది వ‌ర్మ అమ్మాయిల కోసం సినిమా తీశాడా అని షాక్ అయ్యారుక‌దా...? మీరు చదువుతున్నది నిజ‌మే.

జ‌న‌ర‌ల్ గా వ‌ర్మ మూవీ అంటే మాఫియా, హింస‌, సెక్స్..వగైరా వ‌గైరా . వీటి చుట్టే వ‌ర్మ క‌ధ‌లు తిరుగుతాయి. కానీ ఫ‌స్ట్ టైం రాంగోపాల్ వ‌ర్మ అమ్మాయిల‌ను ప్రేమ పేరుతో వేదిస్తున్న కుర్రాళ్ల క‌ధ‌ను సైకోగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌స్తున్నాడు. విశేషం ఏంటంటే య‌దార్ధ గాధైనా సైకోని వ‌ర్మారే రాశార‌ట‌. అయితే ఈ సినిమాకు వ‌ర్మ ద‌ర్శకుడు కాదు. కిశోర్ బార్గవ్ డైరెక్షన్ లో వ‌ర్మ నిర్మించాడు.

ఈ నెల 21న విడుద‌ల కానున్న ఈ మూవీ ప్రమోష‌న్ కోసం వ‌ర్మ హైద‌రాబాద్ వ‌చ్చి 10నిమిషాల పుటేజ్ ని రిలీజ్ చేసి ఆల్ ఛానల్స్ లైవ్ లో కూర్చోని అమ్మాయిలు త‌ప్పక చూడాల్సిన సినిమా అంటూ టంకా వేశాడు. మరి వ‌ర్మ ఆహ్వానాన్ని మ‌న్నించి అమ్మాయిలు దియేట‌ర్లకు క‌దిలితే....అబ్బాయిలూ వారి వెంట వ‌చ్చిన‌ట్టే. ధియేట‌ర్లు హాస్ పుల్ అయిన‌ట్టే .

మరింత సమాచారం తెలుసుకోండి: