ఈ మ‌ద్య టాలీవుడ్ లో ఏ సినిమా చూడండి . చెప్పిన డేట్ కి రిలీజ్ అవ్వడం లేదు. రేపు అంటారు మాపు అంటారు . క‌ట్ చేస్తే చెప్పిన నెల రోజుల కూడా ప్రేక్షకుల ముందుకు రాదు సినిమా. ఇపుడు అత్తారింటికీ దారేదీ కూడా అదే దారిలో వున్నట్టు స‌మాచారం. జూలైలోనే వ‌స్తుంది అంటూ కొద్ది రోజులు ఊద‌గరొట్టిన మూవీ యూనిట్ ఇపుడు లెటెస్ట్ గా చెప్పిన ఆగస్టు7కి రావడం కూడా కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు.

ప్రస్తుతం స్పెయిన్ షెడ్యూల్ లో వున్న ఈ సినిమా టీం హైద‌రాబాద్ రావ‌డానికి ఇంకో నెల రోజులు ఈజీగా ప‌ట్టోచ్చట‌. అక్కడి నుండి వ‌చ్చాక పోస్ట్ ప్రొడ‌క్షన్ వ‌ర్క్ స్టార్ట్ అయితే....త‌రువాత ఆడియో రిలీజ్ , ఆ త‌రువాత మూవీ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే నిజానికి ఈ సినిమాను జూలైలో కూడా విడుద‌ల చేసేలా ప్లాన్ చేసిన‌ప్పటికీ చర‌ణ్ ఎవ‌డు కోసమే ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో మ‌రో వార్త విన‌బ‌డుతోంది.

జూలై సెకండ్ వీక్ లో ఎవ‌డు రిలీజ్ అయితే...రెండు మూడు వారాల గ్యాప్ ఇచ్చి ప‌వ‌న్ ఫిల్మ్ విడుద‌ల చేస్తే ఇటు ఫ్యాన్స్, అటు అభిమానుల‌కీ ఏ ఇబ్బంది వుండ‌ద‌ని డైరెక్టర్ త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడ‌ట‌. అందుకే ఈ ఆల‌స్యమ‌ట‌. సో ఏది ఏమైనా అత్తారింటికీ దారేదీ అన్ని సినిమాల్లాగే లేటుగా ప్రేక్షకుల ముందుకు రానుంద‌న్నది ఫైన్ లైజ్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: