వరసగా సినిమాలు, తద్వారా డబ్బులు పోతున్నా నిర్మాత  డి. శివప్రసాద్ రెడ్డి వాళ్ళతో గానీ మరో హీరోతో సినిమా చేసే ప్రయత్నం చేయడం లేదు. ఇంతకి ఎవరు వాళ్ళు? ఇంకెవరు అక్కినేని అబ్బా కొడుకులు నాగార్జున అండ్ నాగ చైతన్య. 
 

ఒక సినిమా కాకపోతే ఇంకో సినిమాకైనా డబ్బులు వస్తాయని శివప్రసాద్ రెడ్డి ఎదురుచూపు, అరెరె ఈ మూవీకి లాస్ వచ్చింది ఇంకో మూవీ చేసిపెడతానని ఈ హీరోలు ఇస్తున్న కమిట్ మెంట్లు కలిపి చివరికి  రెడ్డి గారికి అమాయకపు చూపును మిగుల్చుతున్నాయి. 
 

ఇంత లాస్ వస్తున్నా రెడ్డి గారి ముఖం పై చిరునవ్వు చూపిస్తూ మరో మూవీకి రెడీ అవుతున్నారు తప్ప, ఓపెనింగ్స్ తోనే పెట్టుబడిని రాబడుతున్న ఏ హీరోను నమ్ముకోవడం లేదు. నాగార్జునతో చేసిన  గ్రీకు వీరుడుని అందరూ సేఫ్టీ ప్రాజెక్ట్ అనుకున్నారు. కానీ ఈ మూవీకి కూడా రెడ్డి గారికి లాసే తెచ్చింది. అయినా మరో మూవీని నాగ్  తనయుడు నాగ చైతన్యతో చేసేందుకు ఈయన రెడీ అయ్యాడు. హల్లో బ్రదర్ రీమేగ్గా అదే పేరుతో  శ్రీనివాస రెడ్డి డైరెక్షన్లో ఈ మూవీ త్వరలో సెట్ పైకి రానుంది. మరి ఈ మూవీ అయినా రెడ్డి గారిని ఒడ్డున పడేస్తుందే లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: