ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు తరువాత సినిమా రంగంలోని 24 శాఖల పైన అవగాహనా ఉన్న ఏకైక టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సినిమా షూటింగుల నుండి ప్రతి విషయం తానే దగ్గర ఉండి చూసుకుంటాడు అది ఆయన ప్రత్యేకత. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది అంటున్నారు. తను నిర్మించే ప్రతి సినిమా ఎడిటింగ్ ఆయనే చూసుకుంటాడు. తనకు చిత్రీకరించిన సన్నివేసాలలో ఏమాత్రం నచ్చకపోయినా ఎడిట్ చేస్తూ ఉంటాడు.అయితే సమస్య రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా గురించే వస్తోంది.

 చిరంజీవి రాజకీయాలలో బిజీగా ఉన్న తన కొడుకు రామ్ చరణ్ సినిమాలను దగ్గర ఉండి ఎడిటింగ్ పర్యవేక్షించడం చిరంజీవికి అలవాటు. గతంలో కూడా చిరంజీవి ‘మగధీర’, ‘రచ్చ’, ‘నాయక్’ సినిమాల ఎడిటింగ్ ను దర్శకుడు ని దగ్గర పెట్టుకుని చిరంజీవి ఎడిట్ చేసాడు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా విషయంలో కూడా చిరంజీవి ఎడిటింగ్ రూమ్ లోకి చొరబడి సలహాలు ఇస్తే ఆ సలహాలను పాటించాల వద్దా అనే డైనమా లో దిల్ రాజు ఉన్నాడని వార్తలు వస్తున్నాయి .

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లుగా ‘ఎవడు’ మొదటి కాపీ వచ్చిన తరువాత అటు చిరంజీవి, ఇటు దిల్ రాజు ఎవరికి వారు కత్తెర పట్టుకుని కటింగులు వేస్తే ఈ సినిమా పరిస్థితి ఏమిటి అంటూ జోక్స్ వినపడుతున్నాయి. చిరంజీవి కోసం దిల్ రాజు తన పద్దతిని మార్చుకుంటాడెమో చూడాలి. ఒకరు మెగా ప్రొడ్యూసర్, మరొకరు మెగా స్టార్. వీరిద్దరి మధ్య ‘ఎవడు’ ఏమౌతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: