చెన్నై ఎక్స్ ప్రెస్ రిలీజ్ కి రెడీ అయింది ...ప్రమోష‌న్ మొద‌లైంది. ఆ ప్రమోష‌న్ లో ఓ విష‌యం కూడా   లీకైంది. అదేంటంటే షారుక్ ఖాన్, దీపికా ప‌దుకోనెతో పాటు మూవీ యూనిట్ మొత్తం ఓ వారం రోజులు బిస్కెట్స్ తిని బ‌తికార‌ట‌. అవే లేకుంటే వాళ్ల  పరిస్ధితి మ‌రోలా వుండేడ‌ట‌. ఏంటి న‌మ్మబుద్ది కావ‌డం లేదా.? కానీ ఇది  నిజం. అస‌లు విష‌యం ఏంటంటే....

డిల్లీ నుండి రామేశ్వరం  వ‌ర‌కు సాగే  ప్రయాణంలో జరిగిన సంఘ‌ట‌న‌లే ఈ సినిమా కధ అని అంద‌రికీ తెలిసిందే. . సో ఆ జ‌ర్నిలో భాగంగా గోవాలోని దూద్ న‌గ‌ర్ అడ‌వి ప్రాంతంలో కొన్ని సీన్స్ చిత్రీక‌రించార‌ట‌. అయితే షూటింగ్ జ‌రిగే ప్రదేశం నుండి వారు బ‌స చేసే ప్రాంతానికి చాలా దూరం.. అందువ‌ల్లే షూటింగ్ కు 6గంట‌ల‌కు వెళ్ళాల్సి వ‌చ్చేద‌ట‌. ఇక షూటింగ్ కి వెళ్లిన త‌రువాత బిజిబిజీగా గ‌డిపేసి బ‌స చేసే ప్రాంతానికి వ‌చ్చేస‌రికీ ఫుడ్ స్పాయిల్ అయ్యేద‌ట‌. ఆర్టిస్టు లు, టెక్నిషియ‌న్స్ క‌లిపి మొత్తం   దాదాపు రెండు వంద‌ల‌మంది వుండేవార‌ట‌. సో అంత‌మందికి వంట చేయ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌ని. దీంతో మార్నింగ్ టిఫిన్ రాత్రి 2గంట‌ల నుండే చేయ‌డం మొద‌లు పెట్టేవార‌ట‌.  
��
అయితే ఆ అడ‌వుల్లో ఆహారాన్ని తీసుకువెళ్లడం సాద్యం కాక మ‌ద్యాహ్నం లంచ్ ని   బిస్కెట్స్ తోనే కానిచ్చేసేవార‌ట‌.  పోని సాయంత్రం తిందామంటే  సాయంత్రానికి రాత్రి చేసిన ఆహారం పాడై అయిపోయేద‌ట‌. దీంతో ఓ వారం రోజులు బిస్కెట్స్ తిని బ‌తికామ‌ని డైరెక్టర్ రోహిత్ శెట్టి షూటింగ్ అనుభ‌వాలు గుర్తుచేశారు. నిజానికి ఇంత క‌ష్టప‌డి చేశారు కాబ‌ట్టే ఔట్ పుట్ బాగా వ‌చ్చింది. ఇప్పటికే రిలీజైన  చెన్నై ఎక్స్ ప్రెస్   ట్రైల‌ర్స్ వ్యూయ‌ర్స్ ని ఓ రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తున్నారు. మ‌రి మూవీ ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: