ఈ యేడాది స‌మ్మ‌ర్‌లో రెండు సినిమాలో హ‌ల్‌చ‌ల్ చేద్దామ‌నుకొన్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. తుఫాన్‌, ఎవ‌డు సినిమాల్ని నెల రోజుల వ్య‌వ‌ధిలో విడుద‌ల చేసి... త‌న ఫ్యాన్స్‌ని ఖుషీ చేద్దామ‌నుకొన్నాడు. కానీ... చ‌ర‌ణ్ క‌ల‌లు ఫ‌లించ‌లేదు. కోర్టు గొడ‌వ‌ల్లో ప‌డి తుఫాన్ ఆల‌స్యం అయ్యింది. క్వాలిటీ పేరుతో ఎవ‌డు వెన‌క్కి వెళ్లింది. దాంతో ఈ వేస‌వికి చ‌ర‌ణ్ ఒక్క సినిమా కూడా తీసుకురాలేక‌పోయాడు.

తుఫాన్‌కి కోర్టు గొడ‌వ‌లు తీరిపోవ‌డంతో... అడ్డంకులు తొల‌గిపోయాయి. ఈ సినిమాని ఇటీవ‌ల చిరంజీవి కూడా చూశార‌ట‌. కొన్ని మార్పులు  చేర్పులు సూచించార‌ట‌. దానితో పాటు.. తుఫాన్‌కి సంబంధించిన కొంత ప్యాచ్ వ‌ర్క్ మిగిలిపోయింది. ఇప్పుడు యుద్ధ ప్రాదిప‌దిక‌పై వాటిని పూర్తి చేసి తుఫాన్‌కి ఓ షేప్ తీసుకొస్తారు.

ఈ సినిమాని అక్టోబ‌రులో విడుద‌ల చేస్తార‌ట‌. ఎవ‌డు వ‌చ్చిన నెల రోజుల త‌ర‌వాత‌.. తుఫాన్‌ని విడుద‌ల చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడు. ఒక సినిమా ఫ్లాప్ అయినా మ‌రోటి ఆదుకొంటుంద‌ని చెర్రీ న‌మ్మ‌కం. రెండూ హిట్ట‌యితే అభిమానుల‌కు పండ‌గే!  తేడా కొడితే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవ‌డం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: