మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కి జ‌పాన్ లో భీభత్సమైన ఫాలోయింగ్ వ‌చ్చేసింది.ఈ మ‌ద్యే  అక్కడ మ‌గ‌ధీర రిలీజ్ చేశారు.ఆ  సినిమా సూప‌ర్ మిట్ అవ్వడ‌మే కాక   చెర్రీకి విప‌రీత‌మైన ఫాలోయింగ్ వ‌చ్చేలా చేసింది. . అది ఎంత‌గా అంటే అక్కడ ఓ కంపెనీ ఏకంగా చెర్రీ బిస్కట్స్ విడుద‌ల చేసేంతగా మాయ చేశాడు చెర్రీ.
��
నిజానికి జపాన్ లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కి మాత్రమే అభిమానులున్నారు.  బాలీవుడ్ లో ఎంత‌మంది స్టార్స్ వున్నా ర‌జీనీకాంత్ అంటేనే జ‌ప‌నీయులు ప‌డిచ‌స్తారు. కానీ ఇపుడు ఆ ఫాలోయింగ్ చెర్రీకి రావ‌డంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విశేషం ఏంటంటే చ‌ర‌ణ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న జంజీర్ ను కూడా జ‌పాన్ లో అత్యధిక సెంట‌ర్లలో రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌.. ఈ సందర్బంగా జంజీర్ డైరెక్టర్ అపూర్వ ల‌ఖియా జ‌పాన్ మార్కెట్లో భీభ‌త్సంగా అమ్ముడుపోతున్న చెర్రి బిస్కెట్స్ ని ట్వీట్ చేశాడు. హావ్ ఎ లుక్.

మరింత సమాచారం తెలుసుకోండి: