జియాఖాన్ మరణం...ఆమె రాసిన లేఖ ఇంక అందరి కళ్లముందు కదులుతునే వున్నాయి. జియా ఇక లేదు అన్న వార్తను జీర్ణించుకోవడానికి మనకి కనీసం నెల రోజులు పట్టేలా వుంది. కానీ జియా ఫ్యామిలీ మాత్రం జియా పోతేనేం ఆమె చెల్లెలు కరిష్మా ఖాన్ ను ఏ హీరోతో ఇంట్రడ్యూస్ చేయాలా అని ధింక్ చేస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలెట్టారు ..
జియా చెల్లెలు కరిష్మా బాలీవుడ్ ఎంట్రీకి ఆమె తల్లి రబీయా ఖాన్ రంగం సిద్దం చేసింది. చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే తన కూతురు తెరంగేట్రం చేయబోయే మూవీకి ఇన్వెస్ట్ కూడా చేస్తానంటోంది జియా తల్లి. ఇప్పటికే చాలా మంది ప్రొడ్యుసర్స్ తో మాట్లాడిన రబీయా ఖాన్ ఓ నిర్మాతతో డీల్ కుదిరించుకున్నట్టు సమాచారం. అయితే అక్క మరణం నుండి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కరిష్మా ఖాన్ అరంగేట్రంలో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది..
అంతేకాదు అక్క జియాలా మాయా ప్రపంచమైన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరినీ ప్రేమించకూడదని డిసైడ్ అయిందట. నిజానికి జియా ఖాన్ జీవించి వున్నప్పుడే కరిష్మా ఖాన్ ఎంట్రీ గురించి చర్చ జరిగిందట. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాన్స్ రావడం కన్నా నిలదొక్కుకోవడం కష్టమని చాలా విషయాలు చెల్లెకి చెప్పిందట. దైర్యం వుంటేనే ఇండస్ట్రీలోకి రా అని ఆహ్వానించిందట. ఈ లోపు జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవడం..ఆ తరువాత విషయాలు తెలిసిందే. అయితే జియా డెత్ కరిష్మాకు కలిసొస్తుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి.మామూలుగా ఎంట్రీ ఇస్తే ఎవ్వరూ పట్టించుకునేవారు కాదని....కానీ ఇపుడు జియా చెల్లెలు అంటే ఆడియెన్స్ లో ఆసక్తి వుంటుందని కొద్దిమంది అంటున్నారు. సరే ఏదైతేనేం జియా చెల్లెలు వస్తోంది. ఆమె అరంగేట్రం ఎలా వుంటుందో చూడాలి.