శంకర్‌--క‌మ‌ల్‌హాసన్ క‌లయిక‌లో వ‌చ్చిన చిత్రం భార‌తీయుడు. క‌మ‌ల్ న‌ట‌న‌కు, శంక‌ర్ దర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కూ ఈ సినిమా నిలువుటద్దం. లంచ‌గొండి త‌నంపై సినిమా తీయాలంటే ఇప్ప‌టికీ ఈ సినిమానే ఓ థీరీగా ఫాలో అయిపోతుంటారు మ‌న ద‌ర్శ‌కులు. భార‌తీయుడు 2 సినిమా తీయాల‌ని శంకర్ చాలార‌కాలుగా ప్ర‌య‌త్నించారు. అయితే..

క‌మ‌ల్‌హాసన్ ఈ సినిమాని సీక్వెల్ చేయ‌డానికి ఒప్పుకోలేద‌ట‌.
అందుకే ఈ క‌థ ఇప్పుడు ర‌జ‌నీకాంత్ ముందుకు వెళ్లింది. వీరిద్ద‌రూ శివాజీ, రోబో సినిమాల్ని తీశారు. అవి రెండూ పెద్ద హిట్స్. ఇప్పుడు మూడోసారి జ‌త క‌ట్ట‌బోతున్నారు. అదీ.. భార‌తీయుడు సీక్వెల్‌తో. శంక‌ర్‌- ర‌జ‌నీ క‌లయిక‌లో హ్యాట్రిక్ సినిమా రాబోతోంద‌ని త‌మిళ చిత్ర‌సీమ‌లో చెప్పుకొంటున్నారు.

 
అది భార‌తీయుడుకి సీక్వెల్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ర‌జ‌నీ, శంక‌ర్‌ల మ‌ధ్య క‌థా చ‌ర్చ‌లు న‌డిచాయ‌ట‌. త్వ‌ర‌లోనే ర‌జ‌నీ ఫ్యాన్స్ ఓ శుభ‌వార్త వినే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: