కమల్హాసన్ ఈ సినిమాని సీక్వెల్ చేయడానికి ఒప్పుకోలేదట.అందుకే ఈ కథ ఇప్పుడు రజనీకాంత్ ముందుకు వెళ్లింది. వీరిద్దరూ శివాజీ, రోబో సినిమాల్ని తీశారు. అవి రెండూ పెద్ద హిట్స్. ఇప్పుడు మూడోసారి జత కట్టబోతున్నారు. అదీ.. భారతీయుడు సీక్వెల్తో. శంకర్- రజనీ కలయికలో హ్యాట్రిక్ సినిమా రాబోతోందని తమిళ చిత్రసీమలో చెప్పుకొంటున్నారు.
అది భారతీయుడుకి సీక్వెల్ అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రజనీ, శంకర్ల మధ్య కథా చర్చలు నడిచాయట. త్వరలోనే రజనీ ఫ్యాన్స్ ఓ శుభవార్త వినే అవకాశం ఉంది.