దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు,తమిళ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపిన బ్లాక్ బ్యూటి త్రిషకు ముహర్తం ముంచుకొస్తుంది. ఇది పెళ్లి ముహర్తం కాదు. ఫిల్మ్ కెరీర్కు ఎండింగ్ కార్డ్. ఈ ముదురు బ్యూటీను హీరోయిన్గా తీసుకోవాలంటే కుర్ర హీరోలకు మోజు లేదంట. అలా అని పెద్ద హీరోలు తీసుకోవాలనుకుంటే, వాళ్ళకు కొత్తదనం కావాలంట అందుకే, త్రిషను తీసుకోవాలా,వద్ద అనే డైలమోలో ఇండస్ట్రీ ఉంది.
ఇంతటి హెవీ కాంపిటీషన్లో త్రిషతోనే మూవీ తీసేందుకు కొన్ని మూవీలు రెడీ అయ్యాయి. ఆ విధంగా వచ్చిన ఓ మూడు మూవీలలో త్రిష నటిస్తుంది. లవ్ స్టోరితో తన కెరీర్ను స్టార్ట్ చేసిన త్రిష, చివరగా ఓ లవ్ స్టోరీతోనే కెరీర్ను ఎండ్ చేయాలనుకుంది. అందుకే చివర మూవీగా గౌతమ్మీనన్ మూవీ దృవనక్షత్రంలో నటించటానికి ఒప్పుకుంది.
ఈ మూవీ తరవాత, తన ఫిల్మ్ కెరీర్కు ఎండ్ కార్డ్ వేయాలని, తన సన్నీహితులతో పార్టీ చేసుకుంటూ ఈ మాటను చెప్పింది.కాకపోతే ఆ ఆశలు అడియాశలు అయి, త్రిష ప్లేస్లో అమలాపాల్ వచ్చింది. ఇప్పుడు ఎవరైన లవ్ స్టోరి తీసుకొని వస్తే ఓకే చేయటానికి త్రిష రెడీ ఉంది. మనసార లవ్చేసి,ప్రేమలో మునిగిపోయి, ఆనందంగా చివరి ఫిల్మ్ రోజులు గడిపేయాలని కోరుకుంటుంది.