ఆయన డైరెక్ట్ చేసినవి  కేవలం రెండే రెండు  సినిమాలు . రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి .మరొక డైరెక్టర్ అయితే ఈ పాటికి టాప్ డైరెక్టర్  అయి పోయి ఉండేవాడు .కానీ ఈయన పరిస్థితి మాత్రం అలాగే ఉంది.ఆయనే శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకం సినిమా సూపర్ హిట్ అయ్యాక మూడు ఏళ్ళ గ్యాప్ తో  సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు  కి ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఈయనను చూసి  ఇండస్ట్రీ లో అసూయ పడని డైరెక్టర్ లేడు, మహేష్ – వెంకటేష్ వీరిద్దరి లో ఎవరో ఒకరి డేట్స్ దొరికినా జాక్ పాట్ అని ఫీల్ అయ్యే పరిస్థితి. అలాంటిది ఇద్దరు టాప్ హీరోస్ ని పెట్టుకుని ఎటువంటి గొడవల్లేకుండా సినిమా తీసాడనే క్రెడిట్ దక్కించు కున్నాడు శ్రీకాంత్ అడ్డాల.

కట్ చేస్తే ఇప్పుడు తను తీయబోయే సినిమా కోసం హీరో ని వెతుక్కునే పరిస్థితి వచ్చింది. నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ ని హీరో గా పరిచయం చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి ఎగిరి పోయింది. దీనితో గొల్ల భామ సినిమా అటక ఎక్కింది  

 ఇక చేసేది లేక ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు కొత్త  నటీనటులతో  తో సినిమా తీసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడట  ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం తనే ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేస్తాడని టాక్.ఈయన కూడా చాలా స్లో గా సినిమా తీస్తాడని టాక్ . మరి ఈ సినిమాకు ఎప్పుడు మోక్షమో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: