గత  సంవత్సరం విడుదల అయిన  దేనికైనా రెడీ ఎన్ని వివాదాలలో చిక్కుకుందో అందరికి గుర్తు ఉండే ఉంటుంది. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించ పరిచే విధం గా ఆ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని అప్పట్లో పెద్ద పెద్ద ఉద్య మాలే జరిగాయి . ఇప్పుడు ఈ సెగ బలుపు సినిమాకు తాకింది మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ  సినిమా  సినిమా విడుదలకు ముందే వివాదంగా మరే పరిస్థితి తలెత్తింది.

ఈ మధ్య విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ లో బ్రాహ్మణుల మనోబావాలను కించపరిచే విదంగా కొన్ని సంభాషణలు వున్నాయని వాటిని తొలగించాలని ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నేతలు నిన్న  బుదవారం సెన్సార్ బోర్డ్ వారికి, ఫిల్మ్ చాంబర్ వారికి వినతి పత్రాలను సమర్పించారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సెన్సార్ జరగలేదు. కాబట్టి ఆ సంభాషణలను తొలగించాలని వారు కోరుతున్నారు. అంతేకాదు ట్రైలర్ లో కూడా ఈ సంభాషణలను తొలగించాలని అంటున్నారు.  

  మంచు విష్ణు పరాజయాల బాటలో ఉన్నప్పుడు విడుదల అయిన దేనికైనా రెడీ కి అప్పుడు ఈ బ్రాహ్మణ వివాదం   మీడియా లో ఫ్రీ పుబ్లిసిటీ తీసుకు వచ్చి ఆ  సినిమా రేంజ్ ని పెంచింది  మళ్ళీ అదే చరిత్ర పునరావృతం అయి మన మాస్ మహా రాజ్ కు కూడా సక్సెస్స్ ఇస్తుందేమో చూడాలి .

 

మరింత సమాచారం తెలుసుకోండి: