తాజాగా య‌ష్‌రాజ్ ఫిల్మ్స్‌ సౌత్ మార్కెట్‌లో ఎంట‌ర్ అవ‌డానికి రంగం సిద్దం చేసుకుంది. బాలీవుడ్‌లో ప‌దుల కొద్ది హీరోయిన్స్‌ను నెల జీతాలతో మెయింటెన్ చేసిన య‌ష్‌రాజ్ ఫిల్మ్స్‌కు స్ట్రాంగ్ ధ‌మ్‌కి ఇచ్చారు. బాలీవుడ్ బ‌డా ప్రొడ‌క్షన్ హౌస్‌ను బెదిరించింది స్వయంగా మ‌న సౌత్ ఇండ‌స్ట్రీ వాళ్ళే. ఈ విష‌యం లేటెస్ట్‌గా వెలుగులోకి రావ‌డంతో సౌత్ ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతుందో అర్ధంకాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు ద‌ర్శకులు

హిందిలో హిట్ అయిన మూవీ బాండ్ బాజా బార‌త్ మూవీను బైలింగ్‌లో నిర్మిస్తున్నారు య‌ష్‌రాజ్ ఫిల్మ్స్‌. తెలుగు,త‌మిళ భాష‌ల‌కు టాలీవుడ్ చోటా మ‌ల్టీ హీరో నానిను హీరోగా తీసుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప‌ట్టాలు ఎక్కాల్సి ఉండ‌గా, ఇంకా ఎటువంటి ప్రి ప్రొడ‌క్షన్ ప‌నుల‌ను మొద‌లు పెట్టలేదు ఈ సంస్థ. కార‌ణం ఏంట‌ని తెలుసుక‌న్న ద‌ర్శకుల‌కు టాలీవుడ్ ప్రొడ‌క్షన్ మాఫియాల నుండి య‌జ్‌రాజ్ ఫిల్మ్‌కు బెదిరింపు కాల్స్ వెళ్ళాయంట‌. ఈ సంస్థ సౌత్‌లోకి ఎంట‌ర్ అయితే కొత్త ద‌ర్శకుల‌కు మాంచి అవ‌కాశాలు ఉంటాయ‌ని డైరెక్టర్స్ భావించారు.

సౌత్‌లో యష్‌రాజ్ ఫిల్మ్స్‌కు స‌రైన థియోట‌ర్లు లేవు క‌నుక ఇదే విష‌యాన్ని యష్‌రాజ్ ఫిల్మ్స్‌కు చెప్పారు. మీరు వ‌చ్చి మా బిజినెస్‌కు అడ్డుగా మారొద్దు. ఒకవేళ ధైర్యం చేస్తే థియోట‌ర్లు ద‌క్కకుండా చేస్తామ‌ని కొన్ని బ‌డా సౌత్ ప్రొడ‌క్షన్స్ అనడంతో, సౌత్ వైపు రావ‌ల‌నే ఆలోచ‌న‌పై మ‌రోసారి ఆల‌చ‌న‌లో ప‌డ్డారు యాష్‌రాజ్ ఫిల్మ్స్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: