నందమూరి నటసింహం బాలయ్య, సక్సెస్ పుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు హీరోయిన్ దొరికింది. మొదట నయనతార, ఆ తరువాత విద్యాబాలన్, ఆ మద్య ఎరికా ఫెర్నాండేజ్ ,ఈ మద్య ఛార్మింగ్ గాళ్ ఛార్మి హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు హల్ చల్ చేశాయి. కానీ బాలయ్యకు జోడిగా నటించబోతుంది క్యూట్ గర్ల్ త్రిషనట. బోయపాటి శ్రీను తన దమ్ము హీరోయిన్ చెన్నై చంద్రానే ఫైనలైజ్ చేశారట.
నిజానికి నిన్ననే త్రిష ఈ సినిమాకు సైన్ చేసిందట. హీరోయిన్ దొరకడం లేదనో లేక మరే రీజనో తెలియదుగానీ ఈ సినిమా చేస్తున్నందుకు త్రిషకు కోటిన్నర రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. . అయితే ఈ విషయం ఎవ్వరికీ చెప్పినా నమ్మడం లేదట. కొద్దిమంది గాసిప్స్ అంటూ కొట్టిపారేస్తున్నారట. దీంతో బాలయ్య సినిమాలో నేనే హీరోయిన్ అంటే నమ్మరేం ..నేను ఆల్ రెడీ సైన్ చేశా. షూటింగ్ కోసం దుబాయ్ కూడా వెళ్తున్నా అంటూ త్రిష ట్వీట్స్ చేసింది.
ప్రస్తుతం తెలుగులో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ఒక తమిళ ఫిల్మ్ చేస్తోన్న త్రిష జయసింహ(వర్కింగ్ టైటిల్)పై భారీ అంచనాలే పెట్టుకుంది. బోయపాటి కధ చెప్పారు. సింప్లి సూపర్. నా పాత్రకు కూడా సినిమాలో చాలా ఇంపార్టెన్స్ వుందంటూ చెప్పుకోచ్చింది సుందరి. అబ్బాయి నటించిన దమ్ముకి త్రిషనే మైనస్ అన్నారు కొద్దిమంది. మరి బాబాయ్ సినిమాకి చెన్నై చంద్రం ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.