యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స‌క్సెస్ ఫుల్ డైరెక్టర్ హారిస్ శంక‌ర్ కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న సినిమా రామ‌య్యా వ‌స్తామ‌య్యా. గ‌బ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బ‌స్టర్ త‌రువాత హారిస్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. సెంటిమెంట్ కోసం పోలాచ్చి వెళ్లిన రామ‌య్య మ‌ద్యలోనే స‌ర్ధుకోని హైద‌రాబాద్ వ‌చ్చేశారు. అర్దం కాలేదుక‌దా..?

విష‌యం ఏంటంటే హారిస్ శంక‌ర్ కి పొల్లాచ్చి సెంటిమెంట్ వుంది. గ‌బ్బర్ సింగ్ లోని చాలా సన్నివేశాలు అక్కడే షూట్ చేశారు. అక్కడ పరిస‌రాలు ...అక్కడి వాతావర‌ణం బాగా న‌చ్చడంతో సెంటిమెంట్ గా ఫీల‌యిన డైరెక్టర్ హారిస్ రామ‌య్యా వ‌స్తామ‌య్యా టీంని అక్కడికి తీసుకువెళ్లాడు. ఒక రెండు రోజులు షూట్ చేశారు. ఇంత‌లో అనుకోని అంత‌రాయం. రుతుప‌వ‌నాల కార‌ణంగా వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో షూటింగ్ ని అర్దాంత‌రంగా ఆపేయాల్సి వ‌చ్చింది. భీభ‌త్సంగా వ‌ర్షం కురుస్తుండ‌టంతో వాన దేవుడు రామ‌య్యను క‌రుణించ‌లేదంటూ .. చేసేది ఏంలేక మూవీ యూనిట్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశారు.

మ‌రి రామ‌య్యా టీం మళ్లీ పొల్లాచ్చి వెళుతుందా...? సెంటిమెంట్ వ‌ర్క్ ఔట్ అవ్వలేదు కాబ‌ట్టి హారిస్ మ‌రోసారి రామ‌య్యను అక్కడికి వెళ‌దామాని పోర్స్ చేస్తాడో లేదో చూడాలి. ఇక ద‌స‌రాకి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో యంగ్ టైగ‌ర్ కి జోడిగా స‌మంత‌, శృతిహాస‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: